Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహారాష్ట్రకు చెందిన పాండురంగ కరాడే తన సోదరి ఇందుబారు నోటి క్యాన్సర్ చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ బసవతారకం హాస్పిటల్కు తీసుకొచ్చారు. ప్రతి 5 రోజులకు ఒకసారి రావాలని డాక్టర్స్ కోరగా నాందేడ్ నుంచి రావడం కష్టంగా మారింది. ఖర్చులకు కూడా డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి సమీపంలో చెట్టు కింద ఆశ్రయం పొంది ఆమెకు ద్రవాహారం పైపు ద్వారా అందిస్తున్నాడు. కూలి నాలి చేసుకుని బతికే తనకు గది అద్దెకు తీసుకునే స్తోమత లేదని పాండు రంగా కరాడే ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో స్పందించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రోగి వద్దకు స్వయంగా వెళ్లి ఖర్చులకు కొంత సమకూర్చి హాస్పిటల్ డైరెక్టర్ టీఎస్ రావుతో మాట్లాడి అతనికి ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్, ఉచితంగా గది ఇప్పించాలని కోరారు వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి వారికి ఉచిత గది ఏర్పాటు చేశారు. దీంతో బసవతారకం హాస్పిటల్ను సందర్శించి వారి సేవలను మేయర్ అభినందించారు.