Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్నగర్లో నివాసం ఉంటూ సొంత వ్యాపారం చేసుకుంటున్న కె.నరేష్ (26) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులను, అతని స్నేహితులను ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో నరేష్ సోదరి శ్వేత శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.