Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
తమ ప్రాణాలను త్యాగం చేసి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4కోడ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికహక్కులను తాకట్టు పెడుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో చర్లపల్లి ఇండిస్టీయల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బీవీ సత్యనారాయణ, జి.శ్రీనివాసులు, ఎస్పీఎం ప్రధాన కార్యద్శి టి.నరసింహా, ఎపిరాక్ ప్రధాన కార్యదర్శి మణికంఠ, శివప్రాక్రేన్స్ ప్రధానకార్యదర్శి రసూల్, ఆశీష్ కార్యదర్శి పి.శ్రీనివాస్, 3డీ ఫోమ్ కట్ ప్రధాన కార్యదర్శి ఆదాం, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నాయకులు వెంకట రామయ్య, నాయకులు ముని స్వామి, చారీ సురేష్, రతన్ రాజు, సూర్యప్రకాశ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.