Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు అందించి వారి మన్ననలను పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ మాల్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు అందించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.