Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈసీఐఎల్ చౌరస్తాలో ఏకశిలా మల్టీ క్యూషన్ రెస్టారెంట్( రాయలసీమ రుచులు), బంక్విట్ హాల్ను మాజీ పార్లమెంట్ సభ్యులు సముద్రాల వేణుగోపాలచారి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. నిర్వాహకులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రీతి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈసీఐఎల్ ప్రజలకు ఏకశిలా రెస్టారెంట్లో ప్రత్యేక రాయలసీమ వంటకాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, కాప్రా సర్కిల్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి రామ్మోహన్, జెర్రీపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దన్పాల్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పాజ్జురి పావని మణిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, సోలిస్ ఆస్పత్రి యజమాని రామాంజనేయులు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బైరి రామ్ చందర్ గౌడ్, కొత్త అంజిరెడ్డి, బేతాళ బాల రాజు, నేమురీ మహేష్ గౌడ్, జోనడ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.