Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
ఏఎస్రావు నగర్ డివిజన్ కమలానగర్ శ్రీసంతోషిమాత ఆలయ ప్రాంగణంలో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు శ్రీసంతోషి మాతా అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో కోవిడ్ నియమాలు పాటిస్తూ నిర్వహిస్తామన్నారు.