Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఓమైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజులరామారం ప్రాంతానికి చెందిన కల్లూరి జయమ్మ, మణ్యం దంపతుల పెద్ద కుమార్తె అస్మిత (16) 10వ తరగతి చదువుతుంది. అయితే మార్చి 30న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపొవడంతో ఆమె ఆచూకీ కోసం చుట్టూ పక్కల, బంధువుల వద్ద వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో తల్లి జయమ్మ శుక్రవారం జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.