Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
వేసవిలో కార్పొరేషన్ ప్రజలకు నీటి సరఫరాలో ఎలాం టి ఇబ్బం దులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పీర్జాదీ గూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జలమండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల లైన్మెన్లతో మాట్లాడి సమస్యలు ఉన్న లైన్లలో మరమ్మత్తులు చేయించాలనీ, ఇంకా ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్తో చర్చించి సమస్యకు పరి ష్కారం చూపేలా అధికారులకు వివరించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, జలమండలి డీజీఎం కార్తీక్రెడ్డి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.