Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశీ వస్తువులను కొనుగోలు చేయాలి... దేశీయ వస్తువుల కొనుగోలుకు ప్రోత్సాహం అం దించాలని నటి వాన్య అగర్వాల్ అన్నారు. బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగమాగమంలో ఆరంభమైన 'నేషనల్ సిల్క్ ఎక్స్పో గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతత్వం లో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్పో 2021ని వర్ధమాన నటి వాన్య అగర్వాల్ ప్రారంభించారు. భారతీయ సంస్కతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ,నేటికి వాటిపై వన్నె తగ్గలెదని వాన్య అగర్వాల్ అన్నారు. నిర్వాహకులు జయెష్ మాట్లాడుతూ ఈనెల 11వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14నగరాల నుండి చేనేత కారులు,చేతి పని బందాలు తమ సిల్క్ చీరలు,హ్యాండ్లూమ్ డ్రెస్ మెటిరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీమణులు మోడల్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.