Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
ప్రేమ్నగర్బస్తీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అంబర్పేట నియోజక వర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ప్రేమ్నగర్ బస్తీలో నెలకొన్న సమస్యలపై బస్తీ వాసులతో కలిసి అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరుకుమార్ గౌడ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ను కలిసి సమస్యలను వివరించారు. ప్రేమ్నగర్ బస్తీలో బస్తీ దవాఖానా ఏర్పాటు, కలుషిత మంచినీటి సరఫరా, నాలా పనులు వంటి సమస్య లను ఎంఎల్ఎ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రేమ్నగర్లో బస్తీ దవాఖానా ఏర్పాటుతో పాటు నాలా పనులు, కలుషిత నీటి సమస్య లను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరగా పరిష్కరిం చేందుకు కృషిచేస్తామని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలను దశల వారీగా పరిష్కరించుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బస్తీివాసులు కె.నరసింహ, వి.అచ్యుత్రావ, సయ్యద్ రెహమాన్, అంజాద్ఖాన్, మోహినుద్దీన్, ప.నరసింహులు తదితరులు పాల్గొన్నారు