Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సుల్తాన్బజార్
నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రజా ఏక్తా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాంకాళి ఉమా మహేశ్వరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమ వారం ఆయన మాట్లాడుతూ ప్రజాసమ స్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ పార్టీ అభ్యర్థి గుర్తు ఇనుప పెట్టె (ఐరన్ బాక్స్) గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డబ్బుతో ఓట్లను కొనాలని చూస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.