Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
ఈనెల 17న జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని పెద్దదేవులపల్లి, పైలాన్ కాలనీ, నాగార్జునసాగర్, హీల్ కాలనీ, నందికొండ, నేడమనూరు గ్రామా లలో బెస్త కులస్తుల ఇంటింటికీ తిరుగుతూ నోముల భగత్ యాదవ్ను గెలిపించాలని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ కోరారు. వీరితో పాటు ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్చార్జి దినేష్ చౌదరి, టీఆర్ఎస్ నాయకులు వివేక్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.