Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్
నవతెలంగాణ-హయత్నగర్
మన్సూరాబాద్ చిన్న చెరువుని పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యం కావాలని హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం డివిజన్ పరిధిలోని మన్సూరాబాద్ చిన్న చెరువు వద్ద స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాబారి నుంచి బయట పడాలి అంటే ప్రతిరోజూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్న చెరువులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరువేరు చేసి జీహెచ్ఎంసీ ఆటోలో వేయాలని వారు సూచించారు.