Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక యువ చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దఊరే బ్రహ్మయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం హర్షనీయమని రజక యువ చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దఊరే బ్రహ్మయ్య అన్నారు. సోమవారం రజక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా ఉన్న కటింగ్, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానుందని చెప్పారు. తద్వారా తరతరాలుగా కుల వత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. కార్యక్రమంలో రజక, నాయీ బ్రాహ్మణ నాయకులు కొత్తపెళ్లి రాజు, శివ వంజరి, నవీన్, అజరు, అఖిల్, విశాల్, అనిల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.