Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు రామంతపూర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫాÛర్మర్తో భక్తులకు, పాదచారులకు గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందిగా ఉన్నందున ఆలయ కమిటీ కార్పొరేటర్ను కోరగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫాÛర్మర్ను అక్కడినుంచి తీయించి ఖాళీ స్థలంలో పెట్టించడం జరిగింది. దానిలో భాగంగా వారితో పాటు ఆలయ చైర్మన్ కోట్ల నరసింహారెడ్డి, ఆలయ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు, శంకర్ వారితో పాటు రామంతపూర్ బీజేపీి ప్రెసిడెంట్ శ్రీ బండారు వెంకటరావు, డివిజన్ జనరల్ సెక్రెటరీ సంకురీ కుమారస్వామి, తిరుపతయ్య, సాయి పాల్గొన్నారు.