Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు షర్మిలక్కతో కలసి నడుద్దామని గ్రేటర్ వైసీపీ నాయకుడు సర్వేపల్లి రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం లోటస్ పాండులోని ఆమె నివాసంలో షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసారని షర్మిలతోనే రాజన్న రాజ్యం సాధ్యమని అన్నారు. తెలంగాణలో నూతన శకానికి నాంది పలికేందుకు ఈనెల తొమ్మిదో తేదీన ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు విజరు కుమార్, మహేష్ కుమార్, జైరాం రెడ్డి, లక్ష్మీ రెడ్డి, అమీద్, శంకర్, భాస్కర్ పాల్గొన్నారు