Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
ఏఎస్ రావు నగర్లోని భవాని నగర్లో అక్రమంగా ఏర్పాటు చేసిన గేట్లను కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. గత కొంతకాలంగా పత్రిక ల్లో వస్తున్న కథనాలు, స్థానికుల ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి ఖుద్దూస్ ఆదేశాల మేరకు టీపీఎస్ ఆధ్వర్యంలో తొలగించారు. ఏసీపీ మాట్లాడుతూ కాలనీ లను గ్రేటర్ కమ్యూనిటీ మాదిరిగా అక్రమంగా గేట్లను ఏర్పాటు చేస్తున్నారని హెచ్చరించారు. ఎవరు కూడా గేట్లను ఏర్పాటు చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా వాహనదారులు, ప్రజలు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.