Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అమ్మమ్మను చూడడానికి హైదరాబాద్కు వచ్చిన భార్య, భర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాటర్ తీసుకొస్తానని వెళ్ళిన భార్య కుమారునితో గుర్తుతెలియని వ్యక్తితో పారిపోయింది. రాజస్తాన్ జోద్పూర్ బారీ ఖోకూండ గ్రామానికి చెందిన ప్రభుదాస్, తన భార్య రమ్య, రెండేళ్ల కుమా రుడు ప్రకాశ్లతో కలిసి ఈనెల 3న హైదరాబాద్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అమ్మమ్మను పలకరించి ఇక ఊరెళదామని ఈనెల 4న కుటుంబ సమేతంగా ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్కు చేరుకున్న రమ్య వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి రెండేళ్ల కుమారుడు ప్రకాశ్తో రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డు వైపుకు వచ్చింది. ఈలోగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుతో ఉండగా రమ్య తన కుమారుడితో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బైకు పై వెళ్లిపోయింది. వీరికి 2018లో పెండ్లి అయింది. అమ్మమ్మ వాళ్ళు మేడ్చల్ ప్రాంతంలో ఉంటున్నారు. చాలా సేపటికి తన భార్య రాకపోవడంతో అనుమానం వచ్చి రైల్వే స్టేషన్ ముందు ప్రభుదాస్ చుట్టుపక్కల వెతికాడు. కనిపించకపోవడంతో అక్కడ ఉన్న వారిని అడుగగా ఓ మహిళ బైకుపై వెళ్లిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. వెంటనే భర్త ప్రభుదాస్ గోపాలపురం పోలీసులకు ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైకుపై వెళుతున్నట్లు సీసీ పుటేజీలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఆమెను ఎందుకు బైక్పై తీసుకువెళ్ళాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.