Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నీటి సంపులో పడి నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో మం గళవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి ఫొటోగ్రాఫరుగా పనిచేస్తూ గోల్నాక మారుతీ నగర్లో నివాసముంటున్నాడు. ఇతని కుమారుడు(4) మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమ యంలో ఇంటి కాంపౌండ్లో ఆడుకుంటున్నాడు. ఆసమ యంలో నీటి సంపు మూత తెరచి ఉండటంతో మహేం ద్ర ఆడుకుంటూ వెళ్లి అందులో పడ్డాడు. కొద్దిసేపు తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లి నీటి సంపు లో చూడగా అపస్మారక స్థితిలో పడ ిఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం రామంతపూ ర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి కి తరలించగా అప్ప టికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.