Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ఎస్బీ విభాగంలో పనిచేసిన జాయింట్ సీపీ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్గా బదిలీ కావడంతో నగర పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ లో జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు సీపీ షీఖాగోయేల్, అనిల్కుమార్, డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ అవినాష్మహంతీ, విశ్వప్రసాద్, ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేష్, డీసీపీలు కమలేశ్వర్, గజారావు భూపాల్, ఎల్.ఎస్.చౌహాన్తోపాటు కరుణాకర్ పాల్గొన్నారు.