Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని సెలూన్లు, లాండ్రీలు, దోబిఘాట్లకు 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. మన రజక సంఘం అధ్యక్షులు మాచర్ల ఉప్పలయ్య, జాతీయ నాయకులు మల్లేష్, ఎంబీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు కలుకూరిరాజు, నల్లతీగలరాజు ఆధ్వర్యంలో సత్కారించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.