Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
రజకుల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని అఖిల భారతీయ దోబీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా వీరేశం, కార్యనిర్వాహక అధ్యక్షులు చిరుకలి శంకర్ కోరారు. మంగళవారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని లాండ్రీలు, దోబీ ఘాట్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించినా కనికరించలేదన్నారు. అర్హులైన రజకులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు యర్ర కృష్ణ, సలహాదారులు అక్కినపల్లి లక్ష్మీనారాయణ, సభ్యులు బొడ్డుపల్లి ప్రవీణ్, విజరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.