Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
మద్యం మత్తులో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లా పూర్ మెట్ మండలం తట్టి అన్నారం ఆర్కె నగర్ గ్రామానికి చెందిన బరణ బాస్ అలియాస్ రాజు(45) ఈనెల 5న ప్రతి రోజులాగే చెత్త ఏరుకుని వాటిని అమ్ముకుని మద్యం సేవించే వాడు. ఆరోజు కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అక్కడే 9సంవత్సరాల బాలిక ఆడుకుంటున్న సమయంలో ఆ బాలికను ఆటో లో తీసుకు వెళ్లి కేక్ తినిపించి సినిమా చూపించి అదే రాత్రి హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనీ వద్ద ఉన్న బస్టాండ్ వద్ద నిదురిస్తున్న సమయంలో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. అతనిపై గతంలో ఉప్పల్, మంగల్ హాట్, మహంకాళి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లలో చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు.