Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం డివిజన్ ఇందిరానగర్ (బి)లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గోల్డెన్ మహిళా ఇందిరానగర్ (బి) స్లమ్ సమైక్య సభ్యులతో కలిసి గాజులరామారం సర్కిల్ డీసీ రవీందర్కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ లైన్లు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు వేయించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు కేపీ విశాల్గౌడ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ జహంగీర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజారుద్దీన్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అఫ్రోజ్, కోశాధికారి మహమ్మద్ అంజద్ఖాన్, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇసాక్, మహమ్మద్ ఫరూక్, గోల్డెన్ మహిళ ఇందిరానగర్ (బి) స్లమ్ సమైక్య అధ్యక్షురాలు షబానా బేగం, ప్రధాన కార్యదర్శి మక్కెన లక్ష్మి, కోశాధికారి నాఫిస్బేగం, సీఆర్పీ నజీమాబేగం పాల్గొన్నారు.