Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘాలు పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. చింతల్ డివిజన్ పరిధిలోని భగత్సింగ్నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులంతా ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు డి.అల్లాబకాష్, ప్రధాన కార్యదర్శి శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు.