Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతాపూర్ డివిజన్లో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు వినూత్న రీతిలో 'శుభోదయం రామంతాపూర్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం కామాక్షిపురం, వాసవీ నగర్లో వివిధ విభాగాల అధికారులతో విస్తతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగు నీరు, డ్రెయినేజీ, గుంతలమయమైన రోడ్లు, వీధిదీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలను పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ ఈఈ నాగేందర్ నాయక్, డీఈఈ నాగమణి, ఏఈ విగేశ్వరి, శానిటరీ సూపర్ వైజర్ సుదర్శన్, జల మండలి డీజీఎం శ్రీధర్ రెడ్డి, మేనేజర్ సాయి బాబా, ట్రాన్స్ కో లైన్ మెన్ చక్రపాణ పాల్గొన్నారు.