Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
పీవీ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని యూనిటీ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 81 మంది తెలుగువారికి 'మన తెలుగుతేజం' జాతీయ అవార్డులు అందజేస్తున్నట్లు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ పి.వెంకటరమణ గుప్త తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 9న బీఎం బిర్లా మ్యూజియంలోని భాస్కర ఆడిటోరియంలో మధ్యాహ్నం 3గం.లకు నిర్వహిస్తామని చెప్పారు.