Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలో యూరోఫ్లెక్స్ ట్రాన్స్మిషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు బుధవారం కంపెనీలో జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 217 ఓట్లు ఉండగా ఐఎన్టీయూసీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్కు 128 ఓట్లు రాగా, టీఆర్ఎస్కేవీ నుంచి పోటీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కేవీ వివేకానంద్కు 53, సీఐటీయూ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ 34, రెండు ఓట్లు చెల్లలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. రెండు, మూడు పర్యాయాలు ఉన్న అధ్యక్షులు కేపీ వివేకానంద్పై 75 ఓట్ల మెజార్టీతో ఐఎన్టీయూసీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ ఘన విజయం సాధించారు. ఈసందర్భంగా కార్మికులు ఆయన్ను పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం బాణా సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.