Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఆసరా పింఛన్లు సకాలంలో అందక వద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతకార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బుధవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పెన్షన్కు అర్హులైన వారితో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు. మేము ఓట్ల అప్పుడే గుర్తుకు వస్తా మా నాయకులకు మామూలు టైములో గుర్తున్నామా అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ మంజూరైన జవహర్ నగర్లో మాత్రం ఇంతవరకు ఎటువంటి సమాచారం ఆసరా పెన్షన్ దారులకు ఇవ్వడంలేదని వాపోయారు. ఇకనైనా ఆసరా పించన్ దారులకు ప్రతి నెల మొదటి వారంలో అందాలని డిమాండ్ చేశారు. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వలన ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రతినెల బ్యాంకులో ఆసరా పింఛన్ పడేటట్లు అధికారులు చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో దివ్యాంగులు. వద్ధులు. వితంతువులు. పాల్గొన్నారు.