Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల జెడ్.పి రోడ్ ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా భారీ వాహనాలను రోడ్ల పైన పార్క్ చేయడం తో ఉదయంపూట వెళ్లే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటుందని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోడ్డుపైన భారీ వాహనాలను పార్క్ చేయడం వలన సగం రోడ్ని ఆక్రమిస్తున్నాయని, రాకపోకలకు వచ్చే వాహనాలకు ఇబ్బందులు అవుతున్నాయని పలు మార్లు వాహనాల యజమానులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోతుందని డివిజన్ ప్రజలు అంటున్నారు. గతంలో ఈ వాహనాలు రోడ్ పైన ఉండటం వల్ల రాకపోకలకు వచ్చే వాహనాలు పలు మార్లు ఢ కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ భారీ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని వేరే స్థానాలకు మార్పు చేసి భవిష్యత్ లో జెడ్.పి రోడ్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని డివిజన్ ప్రజలు ప్రజాప్రతినిధులను అధికారులను కోరినా సమస్యలు అలానే వున్నాయని వాపోతున్నారు.