Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని పాతబస్తీ, చార్మినార్ వద్ద బుధవారం అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చార్మినార్ వద్ద వీధి వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో చిరు వ్యాపారి మొహద్ యసీన్(32) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి వ్యాపారులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వ్యాపారుల వద్ద మామూలు కోసం వచ్చిన వ్యక్తులు గొడవకు దిగడంతోనే ఘర్షణ చోటుచేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.