Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరపోలీస్ కమిషనరేట్లో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలతోపాటు అటాచ్లోవున్న వారిని బదిలీ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట్ పోలీస్స్టేషన్లో అదనపు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జి.నరేష్ను చిక్కడపల్లి ఎస్హెచ్వోగా బదిలీ చేశారు. వేయింట్లో వున్న భూపతి గట్టుమళ్లును నారాయణగూడ ఎస్హెచ్వోగాను, గోల్గొడాలో అటాచ్గా ఉన్న ఎస్.ఎం.రాజును అదే పోలీస్ స్టేషన్లో అదనపు ఇన్స్పెక్టర్గాను, ఎస్ఆర్నగర్లో అటాచ్లో వున్న పి.వి.రామ ప్రసాద్రావును అదే పోలీస్స్టేషన్లో అదనపు ఇన్స్పెక్టర్గాను, బంజారాహిల్స్ ఎస్హెచ్వో ఆర్. కళింగరావును సీటీ ఎస్బీకి, హబీబ్నగర్ ఎస్హెచ్వో పి.శివ చంద్రాను బంజారాహిల్స్ ఎస్హెచ్వోగా బదిలీ చేశారు. వెస్టుజోన్ డీసీపీ వీఆర్ అటాచ్లోవున్న ఎం.నరేందర్ను హబీబ్నగర్ ఎస్హెచ్వోగా బదిలీ చేశారు. నగరంలో మొత్తం ఏడుగురు సీఐలు బదిలీఅయ్యారు.