Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 20వ డివిజన్లోని లక్ష్మి ఎన్క్ల్లేవ్ కాలనీకి చెందిన రమ్యప్రియ జలమండలి శాఖలో మేనేజర్గా ఉద్యోగం సాధించిన సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి పూల మాల శలువాతో ఘనంగాసన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవటం అభినందనీయమన్నారు. ఎంతోమంది చదువుకున్నా అందరూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ ఇటీవల జరిగిన పరీక్షలో ఉతీర్ణత సాధించి జలమండలిలో మేనేజర్గా ఉద్యోగం సాధించటం అభినందనీయమని తెలిపారు.రమ్యప్రియ తన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన కోరారు.