Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ సేవా సమితి అధ్యక్షుడు ఎంఏ ముజీబ్
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్ర అభివద్ధి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్యాలను ప్రజలు తిప్పి కొట్టాలని కేటీఆర్ సేవా సమితి అధ్యక్షుడు, తిరుమలగిరి సాగర్ మండల ఎన్నికల ఇన్చార్జ్ ఎంఏ ముజీబ్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ను గెలిపిస్తాయని అన్నారు. ప్రచారంలో సాగర్ తిరుమలగిరి సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసి రాజశేఖరరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రెహమాన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి, కేటీఆర్ సేవా సమితి శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రావు, సూర్య, పాషా, పాపిరెడ్డి పాల్గొన్నారు