Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ, జగద్గిరిగుట్ట :
కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాలు భాగస్వాములు కావాలని కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధి లోని రాఘవేంద్రకాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఎమ్మెల్యేను చింతల్లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులు ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వరరావు, ట్రెజరర్ ఉమాపతిరావు, అడ్వైజర్ రవీందర్రెడ్డి, కాలనీ వాసులు దివాకర్రెడ్డి, కిషన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.