Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట :
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్కు చెందిన మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు, చైతన్య విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్, చైతన్య కళానికేతన్ వ్యవస్థాప కులు శివరాత్రి యాదగిరి ఉగాది పురస్కార అవార్డును అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం సూర్యచంద్ర కల్చరల్ ఆధ్వర్యంలో ఎల్బి స్టేడియం ప్రెస్క్లబ్ (దేశోద్దారక భవన్) లో నిర్వహించిన వేడుకలకు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనచారి ముఖ్య అతిథిగా హాజరై శివరాత్రి యాదగిరికి ఉగాది పురస్కార అవార్డును అందజేస,ి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అనంతరం తనకు ఈ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తానని, ఈ పురస్కారం అందజేసినందుకు నిర్వాహకు లకు శివరాత్రి యాదగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీని నటి పూజిత, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.