Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా, రాజ్యాంగం అమలు పరిచి సంవత్సరాలు గడుస్తున్నా దళితులపట్ల ఇంకా ఎందుకని వివక్ష కొనసాగుతోందని నిమ్స్ హాస్పిటల్ ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షురాలు సుశీల ప్రశ్నించారు. వివక్షను పూర్తి రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ అణగారిన వర్గాలపై అణచివేత, వివక్ష కొనసాగుతున్నాయని, కొన్ని వర్గాల రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉంటూనే అధికార బలంతో రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటికి లోబడి జీవించడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎంవో డాక్టర్ కష్ణారెడ్డి, ఆర్ఎంవో, డాక్టర్ హేమంత్, ఉమేష్, హెచ్ ఆర్డీ సూపరింటిండెంట్ అధ్యక్షులు పి. సుశీల కుమారి, జనరల్ సెక్రటరీ బి.శేఖర్, ఉపాధ్యక్షురాలు జి.కె. రాణి, వివి విజయలక్ష్మి, ట్రెజరర్ భరత్ భూషణ్, కేవీపీఎస్ నాయకులు పవన్, రవి, తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ జి. నిర్మల పాల్గొన్నారు.