Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
జాతి నిర్మాణ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ రంగా రెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ రింగ్ రోడ్ జంక్షన్లో ఆటో డ్రైవర్ యూని యన్ నాయకులు అంబేద్కర్ 130వ జయం తి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేవీపీఎస్ కమిటీ సంఘం అధ్యక్షుడు కనకయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 74 ఏండ్లు దాటినా కుల వివక్షతో దాడులు ఇంకా జరుగుతున్నాయన్నారు. భారతదేశంలో కొందరికే హక్కులు గుడిలో బడిలో ఎంట్రీ బోర్డులు మహిళలపై ఆంక్షలు ఇలా చెల్లని వాటిపై అన్నింటికీ చెల్ల్లు చిట్టి రాసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం చేసిన త్యాగం కృషిని వెల కట్టలేమన్నారు. ఆత్మగౌరవ హక్కులతో కూడిన స్వేచ్ఛనిచ్చారని కొనియా డారు. ప్రస్తుత తరుణంలో మతోన్మాద శక్తులు దళితులపై దాడులు చేస్తున్నాయనీ, వాటికి దీటుగా బలహీన వర్గాలు ఐక్యమై మతోన్మాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్లో మొత్తం మహానీయుల మాసంగా సంఘ నిర్మాణం యాత్రలు జాతరలు నిర్వహి ంచాలని ఆ మహానీయుల ఆశయాలను తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్ర మంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కన్వీనర్ గంధం మనోహర్, కో-కన్వీనర్ కె.జంగయ్య, రమేష్ చందు, యాదయ్య పాల్గొన్నారు.