Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్లో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొని మాట్లాడారు. మహనీయులు అంబేద్కర్ రచించిన రాజ్యా ంగ ఫలాలతోనే నేడు అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నమనీ, అది అంబేద్కర్ చేసిన త్యాగమని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో జయంతి ఉత్సవాల కమిటీ చైర్మెన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌవాన్, వైస్ చైర్మెన్ మాదరి శ్రీనివాస్, కార్పొరేటర్ గజ్జల రాంచ ందర్, ఓం ప్రకాశ్, దాసరి కిరణ్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.