Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
బీఎన్రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్న గర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో స్థానిక కార్పొ రటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనిపల్లి శ్రీనివాస్రెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ వేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీ యుడు అన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళి తులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలు పెరుగని పోరాటం చేసిన యోధుడనీ, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌ మాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘురామ్ నేత, ఎస్సీఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగం శివశంకర్, ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర కార్యదర్శి కొంగర మహేష్, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యంజాల భిక్షపతి, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, నాయకులు దాసరి శంకర్, కొంగర బాబు, గంగం రాజు, మధుసూధన్, బాలు, చంద్రయ్య, పార్టీ నాయకులు శ్రావణరెడ్డి, శ్రీధర్రెడ్డి, బీజెవైఎం వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.