Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పీడిత వర్గాలకు అంబేద్కర్ సేవ చేశారని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బోయినిపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, పీడిత ప్రజల బాగు కోసం, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం అంబేద్కర్ చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ అహర్నిశలు అదే బాటలో సాగు తున్నారన్నారని తెలిపారు. అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పని చేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మాజీ కంటోన్మెంట్ బోర్డు చైర్మెన్ మహేశ్వర్రెడ్డి, బోర్డు మెంబర్లు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, టీఆర్ఎస్ సభ్యులు, మేధావులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.