Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చంద్రాయణగుట్ట
భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే గొప్పనేత ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ అనీ, మెజారిటీ ప్రజలైన బహుజనులు పూలే మార్క్స్ అంబేడ్కర్ సిద్దాంతాలను అనుగుణంగా పని చేయాలనీ, అణగారిన కులాలు ఆర్దికంగా రాజకీయంగా బలపడకుండా రాజకీయ అధికారం దక్కదని బహుజనుల ప్రజలు అన్ని రంగాల్లో విద్య, వైద్య, ఉద్యోగ, ఆర్దిక, రాజకీయ రంగాల్లో సమాన వాట దక్కకుండా బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం కాదని బహుజన లెప్ట్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గడ్డమీది హరినాథ్ గౌడ్ అన్నారు. బుధవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశ ప్రజల ఉమ్మడి సంపద అనీ, ఆయన ఆలోచనలు ఆశయాలను నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు స్పూర్తి గాయకంగా తీసుకోవాలని గడ్డమీది హరినాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయకులు జి.గోపాల్, నరేశ్, రవీందర్, బీసీ కులాల ఫెడరేషన్ నాయకులు జి.కృష్ణగౌడ్, కె.కిరణ్, తదితరులు పాల్గొన్నారు.