Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-తుర్కయాంజల్
అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ముఖ్యులనీ, ఆయన విధానాలు అగ్రదేశాలకు అనుసరనీయమయ్యాయని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. బుధ వారం తుర్కయంజాల్ చౌరస్తాలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్ర మానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపట్టారని తెలిపారు. ఆయన రూపొందించిన రిజర్వేషన్ ఫలాల వల్లే అట్టడుగువర్గాలకు రాజకీయ అవకాశాలు వస్తున్నాయన్నారు. జీతవిత కాలం పేదల అభివృద్ధి కోసం ఆలోచించిన మహనీయుడనీ, చదువు ద్వారానే పేదలు బలోపేతం అవు తారని విశ్వసించారనీ, విద్య వల్లే సమసమాజ స్థాపన సాధ్యమని నమ్మిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటిచెట్టు అశోక్గౌడ్, మాజీ జెడ్పీటీసీ నోముల కృష్ణగౌడ్, కౌన్సిల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, గుండా ధన్రాజ్, పుల్లగుర్రం విజయానంద్రెడ్డి, తుర్కయంజాల్ అంబే ద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చెక్క బాలనర్సింహ, మేతరి శంకర్, కొమ్మని దయానంద్, కొల్లూరి నిరంజన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.