Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
బీసీ సాధికారత సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్ (71)కు బుధవారం గుండెపోటు వచ్చి మృతి చెందడం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ లతో పాటు పలువురు సంతాపాన్ని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే ఓబీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు బహుజనుల హక్కుల సాధన కోసం జయప్రసాద్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో బీసీ సంస్థ గ్రేటర్ అధ్యక్షులు చిరుకలి శంకర్, పలు బీసీ సంఘాల నాయకులు మేకపోతుల నరేందర్ గౌడ్, చందుగౌడ్, రామ్మోహన్ గౌడ్, రమేష్, అనిల్ కుమార్, డాక్టర్ రాంనర్సయ్య, ఎం.సూర్యనారాయణ, కొండా దేవయ్య, చల్లా వీరేశం, భీమనపల్లి విఠోబా, లింగం ఉన్నారు.