Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి
నవతెలంగాణ-నారాయణగూడ
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతున్నదని మాదిగ జేఏసీ చైర్మెన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి ఆరోపించారు. కంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, పలు దళిత, గిరిజన, బీసీ సంఘాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు బుధవారం సాయంత్రం నగరంలో 'బ్లూషర్ట్స్-నీలి కవాతు' నిర్వహించారు. ఈకవాతు బషీర్ బాగ్లోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ప్రారంభమై ట్యాంక్ బండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి అదిత్యనాథ్ యోగి జై శ్రీరాం నినాదంతో హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. జై భీం నినాదాన్ని బీఎస్పీ నేత మాయావతి నేతత్వంలో పెంచుతామని దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు మాయావతి ఉంటారని, ఒక్క హిందూ మతోన్మాదులు మాత్రమే నరేంద్రమోదీ వైపు ఉంటారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కవాతు కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈనెల 28న రవీంద్రభారతిలో 'రాజ్యాంగ రక్షణ సదస్సు' జరుగుతుందని, ఈ సదస్సులో ప్రతి జిల్లాలో ఇలాంటి కవాతు నిర్వహించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జల కాంతం, బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకష్ణ, కార్మిక నేత కల్లెపొరు ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.