Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మార్గదర్శకాలను స్మరించుకోవడం గౌరవ ప్రదంగా ఉంటుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫక్రుద్దీన్ ఆరీఫ్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్ జీవీకే వన్ 1లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల మార్గదర్శకాలను స్మరించుకోవడం విస్మరించరాదని, ప్రజాస్వామ్యంలో అందరూ సమానులేనని తెలిపారు. వెంకటేశ్వర కాలనీ టీడీపీ అధ్యక్షుడు కొండ్రపల్లి శివ కుమార్, దళిత నాయకులు రమేష్ , ఫణి, సాయి తదితరులు పాల్గొన్నారు.