Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నాలుగు దశాబ్దాల పైగా సాంస్కతిక రంగంలో యువకళావహిని సంస్థ ద్వారా ఎన్నో విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్న వై.కె.గా ఆత్మీయంగా పిలుచుకొనే యార్లగడ్డ నాగేశ్వరరావు(70) బుధవారం సాయంత్రం గుండె పోటుతో మరణించారు. గత మూడ్రోజులుగా దగ్గు జలుబుతో అస్వస్థతకు గురై కోవిడ్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే మధ్యాహ్నం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో వివేకానందనగర్ సమీప హాస్పిటల్ తీసుకు వెళ్లగా అప్పటికి గుండె పోటుతో మరణించారని వైద్యులు ధవీకరించారు. 40 ఏండ్లుగా విభిన్న సాహితీ సాంస్కతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ జంట నగరాల లోనేకాక ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లోనూ గుర్తిపు తెచ్చుకున్నారు. వై.కె. స్వయంగా నటుడు. ఆయన ధరించిన స్వామి వివేకానంద, నేతాజీ, రాణా ప్రతాప్ పాత్రలతో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.గడచిన సోమవారం కూడా సారధి స్టూడియోస్ లో ప్రఖ్యాత రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జయంతిని నిర్వహించారు.
వై.కె. నిరంతర సంస్కతీ కషీవలుడు: డాక్టర్ కేవీ రమణ
వై.కె.నాగేశ్వర రావు నిరంతర సంస్కతీ కషీవలుడు అని, ఆయన అలనాటి సంగీత సాహిత్య ప్రాధాన్యత కళ పాటలను ఇష్టపడి ఎక్కువగా ఆ కార్యక్రమాలు నిర్వహించారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీరమణ అన్నారు. ఆయన స్వయంగా నటుడిని కళారంగానికి పెద్ద దెబ్బ ఆయన మరణమని ఆవేదన వ్యక్తం చేసారు. కళా సంస్థల ప్రముఖులు రసమయి రాము, వంశీ రామరాజు, కిన్నెర రఘు రాం త్యాగరాయ గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు, గాయనీగాయకులు ఆమని, వీ.కె.దుర్గ, సుభాష్, వెంకట రావు, తదితరులు కలానిలయం సురేందర్, కళా పోషకులు జీ.వెంకట రెడ్డి పలువురు వై.కె. మరణం పట్ల దిగ్భ్రాంతి ఆవేదన వ్యక్తంచేశారు. సాంస్కతిక విలేకరులు కూడా ఆయన మతికి కలత చెందారు.