Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ప్రపంచవ్యాప్తంగా శోభానాయుడు అంటేనే కూచిపూడి నాట్యం గుర్తుకొస్తుందని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అన్నారు. బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్లో శ్రీశివసాయి మానస సరోవర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్తన శోభ పేరిట పద్మశ్రీ డాక్టర్ కె.శోభానాయుడు జయంతిని ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. లతా రాజా ఫౌండేషన్ సహకారంతో ప్రముఖ శిల్పి రాజేష్ రూపొందించిన సత్యభామ రూపంలో ఉన్న శోభానాయుడు విగ్రహాన్ని ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆవిష్కరించారు. ఈసందర్భంగా శోభానాయుడు జాతీయ పురస్కారంతో వేదాంతం రాధేశ్యాంను ఘనంగా సత్కరించారు. అలాగే రసమయి వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.కె.రాము, సురభి అవేటి రఘునాథ్ లను ప్రత్యేకంగా సన్మానించారు. తెలుగు నేల, కూచిపూడి సంప్రదాయం ఉన్నంత కాలం శోభానాయుడు ఘనత కొనసాగుతూనే ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు పండిట్ అంజుబాబు, డాక్టర్ అమలాపురం కన్నారావు, దైవజ్ఞ శర్మ, శోభానాయుడు శిష్యులు భాస్కర్, సుమలత, పద్మ హేమమాలిని, లావణ్య, రోహిణి కందాల, అనితా గౌడ్, అలేఖ్య, డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ, పీఎంకే గాంధీ, ట్రస్ట్ నిర్వాహకులు బి.నాగయ్య, బి.మానస, భాస్కర్ పాల్గొన్నారు.