Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకకులు అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ కోసం సామాజిక సైన్యం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ గోషామహాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సభను బుధవారం నిర్వహించారు. చంద్రశేఖర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ సభలో స్కైలాబ్బాబు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అమ్మేస్తున్నదన్నారు. బ్యాంకులు, ఎల్ఐసీ, రైల్వేతోపాటు పలు సంస్థలను ఇప్పటికే నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నూటికి 80 శాతం పేదలకు ఉపయోగపడుతున్న సంస్థల్ని మోడీ కార్పొరేట్లకు అమ్ముతు న్నాడనీ, వాటిని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుండి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్లను ఎత్తేస్తామని నేరుగా చెప్పకుం డానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు, పెట్టుబడి దారుల పరం చేస్తు న్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు లేకు ండా చేయడమే వారి విధానమన్నారు. విద్యాసంస్థల్లో మతోన్మాదాన్ని ప్రవే శపెట్టడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. అంబేద్కర్ వారసులు రాజ్యాంగం రిజర్వేషన్లతోపాటు ప్రభు త్వరంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముందుగా అంబే ద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ సభలో కేవీపీఎస్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కొమ్ము విజరుకుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేశ్వర్రావు, కేవీపీఎస్ కన్వీనర్ జి.కిషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు టి.సతీష్, హరిజన సేవక మండ లి నాయకులు సి.జ్ఞానే శ్వర్, సీఐటీయూ జిల్లా నాయకులు రాజు, రాజేష్, పీఎన్ ఎం జిల్లా నాయకులు కళ్యాణ్, గోపాల్ పాల్గొన్నారు.