Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోచారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్రెడ్డి అన్నారు. యంనంపేట్ 2వ వార్డు పరిధిóలో బుధవారం స్థానిక దళిత సంఘం నాయకులు మీసాల రాజేశ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మీకాశయ్యతో కలిసి ప్రారంభించారు. పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, దళసంఘాల నాయకులు మీసాల మల్లేష్, మేకల దాసు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల బాలేష్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, పోచారం మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్రెడ్డి, నాయకులు నర్రి కాశయ్య, నల్లవెల్లి శేఖర్, పత్తెపు శ్రీహరి, సగ్గు శ్రీనివాస్, పత్తెపు పాండు, ఘట్కేసర్ కౌన్సిలర్లు మేకల పద్మారావు, కడుపోల్ల మల్లేష్, ఇరిటం శ్రీనివాస్, శేఖర్, తదితరులు పాల్గోన్నారు.